PM AWAS YOJANA 2024 | ఈ స్కీమ్ తో సొంతింటి కలను నెరవేర్చుకోండి:
దేశం లోని ప్రజలకు సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఖచ్చితంగా ఉంటుంది.. సొంతింటి కల చాలామందికి నెరవేర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. మధ్యతరగతి ప్రజలు సొంతింటి కట్టుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి మరియు నిరుపేద ప్రజలకు అవసరార్ధం ఇంటిని నిర్మించుకోవడానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రాజెక్టు లో భాగంగా తాజాగా 2024 – 25 బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఈ పథకం(PM AWAS YOJANA 2024) గురించి వివరాలు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PM AWAS YOJANA 2024). అయితే ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు చాలామంది ఈ పథకం ద్వారా సొంత ఇంటి కల ను నెరవేర్చుకున్నారు. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు 40 లక్షల కాంక్రీట్ ఇల్లులను నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ పథకం 2014 అమలులోకి వచ్చింది. అయితే 2025 నాటికి కోటి ఇళ్లను నిర్మించి పేద ప్రజలకు అందించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
ప్రస్తుత బడ్జెట్ లో 2024 – 25 సంవత్సరంలో గత బడ్జెట్ మొత్తానికి 15 శాతం పెంచడం జరిగింది. అంటే ప్రస్తుతం దాదాపు 1013 బిలియన్ రూపాయలను ఈ పథకం(PM AWAS YOJANA 2024) కింద పెద ప్రజలు స్వంత ఇంటి నిర్మాణానికి కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ప్రతి అర్హుడు వారి సొంతింటి కల ను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పొందవచ్చు. ఈ సబ్సిడీ కి సంబంధించిన విషయాలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb