INDIAN RAILWAY | ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ:
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్వర్క్స్లో ఒకటి. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను ఈ రైల్వేస్ తమ గమ్య స్థానాలకు చేరుస్తోంది. ఇండియన్ రైల్వే తక్కువ ధరలో సౌకర్యవంతమైన ప్రయాణం అందించడంలో ఎప్పుడూ ముందుండే రైల్వే(INDIAN RAILWAY) అని చెప్పవచ్చు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూనే ఉంటుంది.
అయితే రైళ్లలో జనరల్ బోగీలో ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ(INDIAN RAILWAY) కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రైల్వే శాఖ ప్రయాణికులకు అందుబాటు ధరల్లో ఆహార పదార్థాలను అందించనుంది. 20, 50 రూపాయలకే జనరల్ బోగీల్లో ప్రయాణించే వారి కోసం నాణ్యమైన భోజనం, స్నాక్స్ అందించాలని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.ఇప్పుడు కేవలం వంద స్టేషన్లలో 150 కౌంటర్లు ఏర్పాటు చేశామని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ సౌకర్యాన్ని భవిష్యత్లో మరిన్ని స్టేషన్లకు విస్తీరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.. ముందుగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 12 స్టేషన్లలో 18 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే తెలుగు రాష్ట్రాలలో 10 స్టేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, వికారాబాద్, విజయవాడ, రేణిగుంట, తిరుపతి, పాకాల, రాజమండ్రి, డోన్, నంద్యాల, గుంతకల్ రైల్వే (INDIAN RAILWAY)స్టేషన్లలో తక్కువ ధరలో భోజనం, స్నాక్స్ అందించనున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb