తలైవా అని వినగానే మీకు గుర్తుకు వచ్చే పేరు హీరో రజినీకాంత్. ఈ తరం హీరో లతో పాటు సినిమాలు రిలీస్ చేస్తూ గొప్ప హీరో గా చెప్పవచ్చు. అయితే గత నెల రజనీకాంత్ సినిమా ‘లాల్ సలామ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది. ఈ మూవీ అనంతరం టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ చేస్తున్న హీరో రజినీ తర్వాత లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో ఒక చిత్రంలో నటించనున్నారు. రజినీకాంత్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నాడు.
ప్రస్తుతం హీరో రజనీకాంత్ జై భీమ్ మూవీ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ డైరక్షన్ లో ‘వెట్టయాన్’ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగులో వేటగాడు పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా లో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో జరుగుతుంది.
ఈ సినిమా షూటింగ్లో పాల్గోనడానికి హీరో రజినీకాంత్ చెన్నై నుంచి కడపకు విమానంలో లో ఓ సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్లో వచ్చారు. ఇక కడపకు వస్తుండగా..ప్రస్తుతం రజనీకాంత్ విమానంలో కూర్చొన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ లో తమిళ హీరో జీవా కూడా రజినీకాంత్తో ఫోటో దిగడం.. వారి ఫోటోస్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం తో వైరల్ గా మారాయి.