మోనాలిసా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చిన అమ్మాయి.. అయితే కుంభమేళా కు వచ్చిన కొందరు యూట్యూబర్లు ఆమె ఫొటోలు మరియు వీడియోలు తీసి సోషల్ మీడియా వైరల్ చేసేశారు. మోనాలిసా కొన్ని గంటల వ్యవధిలోనే నెట్టింట వైరల్ గా మారిపోయింది. అప్పటినుండి సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, వార్తలే కనిపించాయి.
కొన్ని గంటల వ్యవధీలోనే స్టార్ అయిన మోనాలిసాకు తన తర్వాతి సినిమా లో ఛాన్స్ ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రకటించాడు.ఇక కుంభమేలా లో ఆమె అభిమానులు వెంటాడడంతో మోనాలిసా వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది.వారి వ్యాపారం తగ్గిపోవడం తో ఆమె తండ్రి నిర్ణయం తీసుకుని, మోనాలిసాను అక్కడ నుంచి తిరిగి ఇంటికి పంపించేశారు.కానీ, అప్పటికే ఆమె వీడియోలు,ఫొటోలు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ మారాయి. తన వీడియోస్ వైరల్ అవ్వడం తో ఎక్కడ చూసిన తన పేరు మార్మోగిపోయింది.
మోనాలిసా కు బాలీవుడ్ మూవీ లో నటించే ఆఫర్ వచ్చింది. తాజాగా ఆమె తన మొదటి చిత్రానికి సంతకం చేసింది.దర్శకుడు సనోజ్ మిశ్రా (Sanoj Mishra) కుంభమేళా స్టార్ మోనాలిసా కు ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో ఛాన్స్ ఇవ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.దర్శకుడు సనోజ్ మిశ్రా (Sanoj Mishra) స్వయంగా మోనాలిసా ఇంటికి వెళ్లారు. తాను ఆఫర్ చేసిన చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు. ఇక చిత్రీకరణకు ముందు ముంబైలో మోనాలిసాకు యాక్టింగ్ నేర్పించనున్నారు.