తెలంగాణలోని కోటి మందికి పైగా ఉన్న రేషన్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురును అందించింది.
మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి: రానున్న వేసవి కాలంలో ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఏప్రిల్ నెలలోనే పంపిణీ చేయాలని కేంద్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.
రాజమండ్రిలో కల్తీ పాల కలకలం: పెరుగుతున్న మృతుల సంఖ్య, ఆందోళనలో బాధితులు.
ఒక్కో వ్యక్తికి 18 కిలోల బియ్యం: ప్రభుత్వం ప్రతి కార్డుదారుడికి నెలకు ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇప్పుడు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి ఇవ్వడం ద్వారా ఒక్కో వ్యక్తికి మొత్తం 18 కిలోల బియ్యం అందుతుంది. ఉదాహరణకు నలుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి ఒకేసారి 72 కిలోల బియ్యం లభిస్తాయి.
వేసవి కాలంలో ఊరట: ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ప్రతి నెల రేషన్ షాపుల వద్ద క్యూ కట్టే ఇబ్బందులను తప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాజమండ్రిలో కల్తీ పాల కలకలం: పెరుగుతున్న మృతుల సంఖ్య, ఆందోళనలో బాధితులు.
సాంకేతిక మార్పులు: గతంలో ఒకేసారి బియ్యం పంపిణీ చేసినప్పుడు ఎదురైన సర్వర్ సమస్యలను ఈసారి అధిగమించేందుకు సాఫ్ట్వేర్ అప్డేట్లు వంటి మార్పులు చేస్తున్నారు.