అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంటూ ముఖ్యమంత్రి Revanth Reddy పలు కీలక ప్రకటనలు చేశారు. మహిళలకు ఇప్పటికే అమలులో ఉన్న ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని మరింత విస్తరించి, భవిష్యత్తులో ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని సీఎం వెల్లడించారు. ఇప్పటికే 500 ఈవీ బస్సులు అందుబాటులోకి వచ్చాయని, డిసెంబర్ 2026 నాటికి మొత్తం 2300 బస్సులను ప్రవేశపెట్టి నగరంలో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఈ కొత్త ఏసీ ఈవీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించగలిగేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
బాడీ లో రోగాలు రాకుండా ఎలా కాపాడుకోవాలి?
ఇక కాలేజీలకు వెళ్లే యువతుల కోసం మరో కీలక నిర్ణయాన్ని కూడా సీఎం ప్రకటించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసి చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలను అందించే పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల విద్యార్థినులు సులభంగా కళాశాలలకు వెళ్లగలరని, అలాగే పర్యావరణానికి హానికరం కాని వాహనాల వినియోగం పెరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమాలు ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రకటించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని సీఎం ఆకాంక్షించారు. మహిళల ఆర్థిక శక్తి పెరిగితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ప్రతి సంస్థ బాధ్యత అని కూడా పేర్కొన్నారు.
వేస్ట్ నుంచి బెస్ట్..కొబ్బరి పీచుతో లక్షల్లో ఆదాయం.