
ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం కొనసాగుతోంది. ఇది నవంబర్ 11 వరకు పొడిగించబడింది. గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన రైతులకు న్యాయం చేయడానికి చంద్రబాబు నాయుడు ఆదేశించినప్పటికీ, రెవెన్యూ శాఖ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరలో దీనిపై ఒక పరిష్కారం వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Also Read: Obesity ని సింపుల్ గా తరిమేసే దివ్య ఔషధం.
ఆంధ్రప్రదేశ్లో ఆ భూములపై నిషేధం మరోసారి పొడిగించారు. ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం నవంబర్ 11 వరకు కొనసాగనుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి ఫ్రీ హోల్డ్ భూములపై నిషేధాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత 15 నెలలుగా ప్రభుత్వం దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైన వారికి వెంటనే న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కానీ రెవెన్యూ శాఖ మాత్రం ఈ సమస్యను పరిష్కరించలేదు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటి రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. ఆ తప్పులను సరిదిద్దుతామని ప్రభుత్వం తెలిపింది.. కానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Also Read: ఇంట్లో చెత్త పారేస్తున్నారు ! మరి బాడీలో చెత్త ఎలా ?
ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 5న ఫ్రీ హోల్డ్ భూముల సమస్యలపై రెవెన్యూ శాఖతో చర్చించారు. ఒకవేళ ఫ్రీ హోల్డ్కు అర్హులైన వారు ఏ పార్టీ అయినా సరే న్యాయం జరగాలని ఆయన స్పష్టం చేశారు. అర్హత ఉన్న అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఆయన అన్నారు. 20 ఏళ్ల గడువు దాటిన భూములను ఫ్రీ హోల్డ్ చేయాలన్నారు. రెవెన్యూ శాఖ మాత్రం ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. దీంతో స్థానిక నాయకులు తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా చిన్న రైతులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి అర్హులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో ప్రభుత్వం త్వరగా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే బావుంటుంది అంటున్నారు.
Also Read:ఎలాంటి వారికి దొరుకుతాయో తెలుసా?
అర్హత ఉన్న అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని.. ఆలస్యం చేయవద్దని కూడా చంద్రబాబు ఆదేశించారు. అసైనీలు భూమి Possessionలో ఉండి, సరైన రికార్డులు కలిగి ఉంటే, 20 ఏళ్ల గడువు దాటిన వాటిని రాజకీయాలతో సంబంధం లేకుండా ఫ్రీ హోల్డ్ చేయాలన్నారు. ‘అసైన్మెంట్ రికార్డులు లేని భూములు, కలెక్టర్ ఉత్తర్వులు లేనివి, జీవో 596కి విరుద్ధంగా ఉన్నవి, ఎక్కువ విస్తీర్ణం క్లెయిమ్ చేసేవి, ఇతరులు క్లెయిమ్ చేసే భూములు, అభ్యంతరాలున్న పోరంబోకు భూములు, నీటి వనరులున్న పోరంబోకు భూములు, 20 ఏళ్ల గడువు దాటని అసైన్డ్ భూములకు ఫ్రీ హోల్డ్ వద్దు’ అని కూడా చెప్పారు. దాదాపు 7 లక్షల ఎకరాల భూమి అర్హత కలిగి ఉందని గుర్తించగా.. కనీసం వాటినైనా నిషేధం నుండి తొలగించాలని కోరుతున్నారు.
Also Read:రక్తాన్ని పెంచే నేచురల్ స్వీట్.
గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారంపై అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2024 మే నాటికి 13 లక్షల ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ అయినట్లు గుర్తించారు. ఇందులో 7 లక్షల ఎకరాలు సక్రమంగా జరిగాయని.. 5 లక్షల ఎకరాల్లో అక్రమాలు జరిగాయని రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ అక్రమాలపై విచారణ జరుగుతోంది. మంత్రివర్గ ఉపసంఘం అక్టోబరులో నివేదిక ఇస్తామని చెప్పింది. దీంతో దసరా నాటికి నిషేధం ఎత్తివేస్తారని భావించారు. కానీ తాజాగా నిషేధాన్ని మరో రెండు నెలలు పొడిగించారు. దసరా కాదు, దీపావళి పూర్తయ్యాక కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదంటున్నారు.