
స్వామి వివేకానంద లాంటి మహాత్ములు ఈ ఎన్నో మంచి విషయాలను నేటితరం యువత కి పనికి వచ్చే విధంగా ఎప్పుడో చెప్పేశారు. వివేకానందుని సూక్తులలోని జ్ఞాన సంపద ఇప్పటికి ఎప్పటికీ ఆచరణనీయం గా ఉంటాయి… జీవితంలో ప్రతి సంఘటనలను ఎన్నో గొప్ప సూక్తులు గా చెప్పారు. ఇక అసలు విషయానికి వస్తే ఒక తెలివైన పురుషుడు ఒక స్త్రీకి చెప్పకూడని రెండు విషయాల గురించి కూడా ఆయన సూక్తులలో ప్రస్తావించారు.
ఇప్పుడు ఆ విషయాలు ఎంటో తెలుసుకుందాం.. బంగారం ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు. అలాంటి బంగారాన్ని కూడా బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఒక బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు కంటి తో చూసి చెప్పేస్తారు. అయితే నవ్వితే చూడవలసింది దంతాలను కాదు దరహాసాన్ని, ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు కారణాలను, గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితో, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితో పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పారు.
జీవితంలో ఏదీ శాశ్వతం కాదు గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. మనకి నిన్న అనేది తీరిపోయిన రుణం.. రేపు అనేది దేవుడు ఇచ్చిన వరం.. ఎవరినో నమ్ముకుని ఏదో చేసేద్దాం ఏదో అయిపోదాం అనుకోకు, ఇది సినిమా కాదు జీవితం.. నీకోసం నువ్వు తప్ప ఎవ్వరూ నిలబడరు.. కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేది కాదు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి.
ఎదుటివారు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తాయి. అయితే జీవితాన్ని అర్థం చేసుకునేవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు . ఎందుకు అంటే ఈ ప్రపంచంలోకి వచ్చేప్పుడు మనం ఒంటరిగానే వచ్చాం పొయెప్పుడు ఒంటరిగానే పోతాం అని చెప్పాడు. అయితే ఒక తెలివైన మగాడు స్త్రీకి ఈ రెండు విషయాలు చెప్పడు, ఒకటి అతని నిజమైన భావాలు.. రెండు అతని సమతుల్యత. ఈ విషయం పై మీరేమంటారో కామెంట్ చేయండి.