
RACHANA-SAHADEVA
RACHANA SAHADEVA: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో హీరోయిన్ సమంతకు ముగ్గురు చెల్లెల్లు ఉంటారు. అయితే వారిలో అందరికన్నా చిన్న చెల్లి పాత్రలో నటించింది ఈ రచన సహదేవ. ఈమె పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అందరినీ మెప్పించింది.. ఇక ఈ ముద్దుగుమ్మ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ లో సమంత తో కలిసి అల్లరి చేసి అందరిని అలరించింది. అయితే ఈ సినిమాలోని ఒక సీన్ లో ఈ మూవీ లో హీరోయిన్ ఫ్యామిలీ ఒక హోటల్ కి వెళ్ళినప్పుడు రచన ..” ఏంటి కూలెక్కలేదా ఇంకా వాటరు..” అంటూ గోదావరి యాస లో చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది.
అయితే ఈ సినిమా లో ఈ ఒక్క మాటకి రచన సహదేవకి మంచి పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ఈమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.రచన స్వతహాగా డాన్సర్ అయిన ఇప్పుడు ఈమె సినిమాలకు దూరం గా ఉంటున్నారు. అయితే ఈమెకు 2019 లో వివాహం జరిగింది. ఈమె కు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రచన సహదేవ సింగపూర్ లో నివసిస్తున్నారు.
రచన సహదేవ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలని, ఫ్యామిలీ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటారు. అయితే మధ్యే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మొదలు పెట్టరు. ప్రస్తుతం రచన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే ఆ ఫోటోలని చూసిన ఆమె ఫాన్స్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో చిన్న పిల్ల అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



