
మనదేశ రక్షణలో విధులు నిర్వహించే మనము ప్రతి జవాన్ కి ఋణపడి ఉన్నట్లే, ఇక అసలు విషయానికి వస్తే రైల్వే స్టేషన్లో వర్షిణి తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. ఈమె భర్తను, తల్లిదండ్రులను కౌగలించుకుని ఏడ్చేసింది. విధి నిర్వహణ కోసం పది నెలల బిడ్డను భర్తను అప్పగించి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత అందర్నీ వదిలి రైలెక్కింది.ఆమె రైలు కదులుతున్నా ఆమె డోర్ దగ్గరే నిల్చుని తన వాళ్లకు వీడ్కోలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సంఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కర్వీర్ తాలూకా నంద్గావ్కు చెందిన బిఎస్ఎఫ్ జవాన్ వర్షా రాణి. ఈమె ఒక బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్గా పని చేస్తోంది. ఈమె పది నెలల కిందటే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. జరిగిన పోయిన పది నెలల పాటు ఆమె తన బిడ్డ ఆలనా పాలనా చూస్తూ ఎంతో సంతోషంగా కాలం గడిపింది. తిరిగి ఉద్యోగానికి వెళ్లాల్సిన సమయం రావడంతో విధులకు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
వర్షా రాణి బిడ్డను వదిలి డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు ఆమె సిద్ధమైంది. ఈ నేపధ్యంలో రైల్వే స్టేషన్కు బయలుదేరింది. ఆమె కు డ్యూటీకి వెళ్లాలనే కోరిక ఏ మాత్రం లేకపోయినప్పటికీ బలవంతంగా రైలు ఎక్కాల్సి వచ్చింది, ఆమె తన బిడ్డను భర్త చేతుల్లో పెడుతూ భావోద్వేగం ఆపులేక బోరున విలపించింది. . తన బిడ్డను వదల్లేక కన్నీళ్లు పెట్టుకుంది. ఒక్కసారిగా భర్తను, తల్లిదండ్రులను కౌగలించుకుని ఏడ్చేసింది.
ఇక చేసేది ఏమి లేక అందర్నీ వదిలి రైలెక్కింది. ఆమె రైలు కదులుతున్నప్పటికి డోర్ వద్దే నిల్చుని బిడ్డను చూస్తూ కన్నీటితో వీడ్కోలు పలికింది. ప్రస్తుతం ఈ తల్లి కన్నీరు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. మేరా భారత్ మహాన్.