
ఇండస్ట్రి లో చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు మాస్టర్ భరత్. ప్రస్తుతం మాస్టర్ భరత్ కూడా పెద్దవాడు అయ్యాడు. అయితే ఒకప్పుడు మాస్టర్ భరత్ చేసిన కామెడీ సీన్లకు ఎంతో క్రేజ్ ఉంది. మాస్టర్ భరత్ ‘రెడీ’ సినిమాలో చిట్టి నాయుడు పాత్ర పోషించి నవ్వుల పువ్వులు పండిచాడు. ఇక మాస్టర్ భరత్ గురించి ఇండస్ట్రి లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఈయన అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. చిన్న తనంలో ఇతన్ని చూసిన వారంతా మొదట షాక్ అయ్యారు. మాస్టర్ భరత్ ‘వెంకీ’ ‘కింగ్’ ‘రగడ’ ‘దూకుడు’ వంటి మూవీస్ లో బాల నటుడిగా నటించి అద్భుతమైన కామెడీ పండించాడు. ఈయన ఎన్టీఆర్ – శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్ షా’ సినిమాలో సన్నగా మారాడు. అతడిని అలా చూడటంతో లుక్ ఇలా మారిపోయిందేంటి అని అనుకున్నారు.
‘ఎబిసిడి’ మూవీ లో మరింతగా సన్నబడి షాకిచ్చాడు. మాస్టర్ భరత్ ఎందుకు ఇలా మారిపోవాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తే షాకింగ్ నిజాన్ని చెప్పుకొచ్చాడు… “నాకు ఊహ తెలిసినప్పుటి నుండీ సినిమాల్లోనే ఉన్నాను. నేను చదువు పరంగా మెడిసిన్ పూర్తి చేసాను.. ఇప్పుడు మెడిసిన్లోనే డాక్టరేట్ చేస్తున్నాను. తమిళ ఇండస్ట్రి లో కూడా నేను పలు సినిమాలు చేశాను. చెన్నైలో కాలేజీలో చేరిన తరువాత కొత్తలో నాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది.
దానితో అప్పటి వరకూ లావుగా ఉన్న నేను సన్నబడిపోయాను. ఇప్పుడు నాకు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. జిమ్ లో వర్కవుట్ లు చేస్తున్న సమయంలో రాడ్లో ఉండే స్ప్రింగ్ వచ్చి నా కన్నుకి గట్టిగా తగిలేసింది.కుడి కన్ను సరిగా కనిపించదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు చెక్ చేసినపుడు కంట్లో బ్లాక్ ఉంటుందని.. మందులతో తగ్గిపోతుందని చెప్పాడు. కొన్ని రోజులు కళ్ళ జోడు పెట్టుకుని తిరిగాను. అయినా ఇప్పటికీ అది క్యూర్ అవ్వలేదు. నాకు ఇంకా ఆ కన్ను కనిపించడం లేదు” అని చెప్పుకొచ్చాడు నటుడు భరత్.